మరోసారి రామకృష్ణారెడ్డికి ఉపాధ్యక్ష పదవి | Sakshi
Sakshi News home page

మరోసారి రామకృష్ణారెడ్డికి ఉపాధ్యక్ష పదవి

Published Sun, Feb 12 2017 11:33 PM

ramakrishnareddy elected once again

కర్నూలు(అగ్రికల్చర్‌): రాష్ట్ర నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడిగా జిల్లా నుంచి జి.రామకృష్ణారెడ్డి రెండవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల సీనియర్‌ అసిస్టెంట్‌గా ఉన్న ఈయన మరోసారి ఆశోక్‌బాబు, చంద్రశేఖర్‌రెడ్డి ప్యానల్‌ తరుఫున విజయవాడలో  ఆదివారం నామినేషన్‌ ధాఖలు చేశారు. జిల్లా ఎన్‌జీఓ అసోసియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు వీసీహెచ్‌ వెంగళరెడ్డి, జవహార్‌లాల్‌ ప్రతిపాదించారు. ఒకే నామినేషన్‌ ధాఖలు కావడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డిని అసోసియేషన్‌ నాయకులు అభినందించారు. 
 

Advertisement
Advertisement