రాట్నాలమ్మకు లక్ష కుంకుమార్చన | Sakshi
Sakshi News home page

రాట్నాలమ్మకు లక్ష కుంకుమార్చన

Published Wed, Apr 12 2017 8:59 PM

రాట్నాలమ్మకు లక్ష కుంకుమార్చన

రాట్నాలకుంట(పెదవేగి రూరల్‌): రెండో రోజు ధనలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన రాట్నాలమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఉదయం 9 గంటలకు సామూహిక విశేష లక్ష కుంకుమార్చన, మధ్యాహ్నం 12 గంటలకు లలితా త్రిపుర సుందరి హోమం, పూర్ణాహుతి నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పుష్పయాగోత్సవం, రాత్రి 9 గంటలకు  రేలా రేలా జానపద నృత్య ప్రదర్శన,  భక్తచింతామణి నాటకం వేశారు. ఈ పూజా కార్యక్రమాల్లో పెదపాడు ఎంపీపీ మోరు శ్రావణి పాల్గొని పూజలు నిర్వహించారు. 
 
 

Advertisement
Advertisement