ప్రధాని సందేశం వినేందుకు ఏర్పాట్లు చేయండి | Sakshi
Sakshi News home page

ప్రధాని సందేశం వినేందుకు ఏర్పాట్లు చేయండి

Published Sun, Apr 24 2016 3:44 AM

ready to prime minister massage

డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీ, కార్యదర్శులకు డీపీఓ అరుణ ఆదేశం
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : జాతీ య పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్‌పూర్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ జాతికిచ్చే సందేశాన్ని వినేందుకు గ్రామ పంచాయతీల్లో అవసరమైన ఏర్పాట్లను చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులను డీపీఓ అరుణ ఆదేశించారు. ఈ మేరకు ఆమె శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. దేశాభివృద్ధిలో గ్రామ పంచాయతీల పాత్ర, పంచాయతీ రాజ్ వ్యవస్థ తీరుతెన్నులు తదితర అంశాలపై ప్రధాని ప్రజలకు అవగాహన కల్పిస్తారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రసారమయ్యే ఈ కార్యక్రమాన్ని వినేందుకు, చూసేందుకు ఆయా గ్రామ పంచాయతీల్లో టీవీలు, రేడియోలను అందుబాటులో ఉంచాలన్నారు. ఈ మేరకు తగు ప్రచారం కల్పించాలని ఆమె ఆయా డివిజన్ల డీఎల్‌పీఓలు, ఈఓపీఆర్‌డీలకు ఆదేశాలు జారీ చేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement