Sakshi News home page

గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 23న కౌన్సెలింగ్‌

Published Thu, Jul 21 2016 1:30 AM

Residential degree colleges counseling on April 23

డిచ్‌పల్లి : జిల్లాలో నూతనంగా ప్రారంభించిన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఫస్టియర్‌లో ప్రవేశాలకు ఈ నెల 23న విద్యార్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా సమన్వయాధికారి జె సాయినాథ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థినులు 23వ తేదీన డిచ్‌పల్లి మండలం ధర్మారం(బి) గురుకుల కళాశాలలో ఉదయం 9 గంటలకు నిర్వహించే కౌన్సెలింగ్‌కు సకాలంలో హాజరు కావాలని ఆయన సూచించారు. 9.30 గంటల తర్వాత కౌన్సెలింగ్‌కు అనుమతించరని ఆయన స్పష్టం చేశారు. కౌన్సెలింగ్‌ పూర్తయ్యే వరకు అభ్యర్థినులు కళాశాల ఆవరణలోనే ఉండాలన్నారు. అభ్యర్థినులు సంబంధిత ఒరిజినల్‌ సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని ఆయన తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థినులు కౌన్సెలింగ్‌ సమయంలోనే ఒరిజనల్‌ ధృవీకరణ పత్రాలను అధికారులకు సమర్పించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. 

Advertisement

What’s your opinion

Advertisement