'తొలి రోజు అమ్మవారి నిజరూప దర్శనం' | Sakshi
Sakshi News home page

'తొలి రోజు అమ్మవారి నిజరూప దర్శనం'

Published Thu, Sep 15 2016 1:48 PM

review meeting on dasara celebrations in vijayawada

విజయవాడ : దసరా నవరాత్రుల తొలిరోజు శ్రీకనకదుర్గ అమ్మవారు నిజరూప దర్శనం ఇస్తారని విజయవాడలోని శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లు దేవస్థానం ఈవో ఏ సూర్యకుమారి వెల్లడించారు. ఓ భక్తుడు ఇచ్చిన రూ. 4 కోట్లతో రూపొందించిన స్వర్ణ కవచాన్ని అమ్మవారికి అలంకరిస్తామన్నారు.

గురువారం విజయవాడలో కృష్ణా జిల్లా కలెక్టర్ ఏ. బాబు అధ్యక్షతన దసరా ఉత్సవాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ కేశినేని నాని, జెడ్పీ చైర్మన్ జి.అనురాధ, విజయవాడ నగర్ మేయర్ కె. శ్రీధర్, మున్సిపల్ కమిషనర్ జి.వీరపాండ్యన్, పోలీసు ఉన్నతాధికారులతోపాటు ఆలయ అధికారులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement