ఏలూరులో కారు బీభత్సం | Sakshi
Sakshi News home page

ఏలూరులో కారు బీభత్సం

Published Sat, Aug 5 2017 12:55 AM

ఏలూరులో కారు బీభత్సం - Sakshi

ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి
ఇద్దరికి గాయాలు
 
ఏలూరు అర్బన్‌ : ఏలూరులో శుక్రవారం రాత్రి అగంతకుడొకరు మద్యం మత్తులో కారు నడుపుతూ పాత బస్టాండ్‌ సెంటర్‌లో భీభత్సం సృష్టించాడు. అల్లూరి సీతారామరాజు స్టేడియం నుంచి పాత బస్టాండ్‌ ఓవర్‌ బ్రిడ్జి మీదుగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తోన్న పలు వాహనాలను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి కారులోని ఎయిర్‌ బ్యాగ్‌లు తెరుచుకోవడంతో సురక్షితంగా ఉన్నాడు. భీభత్సం గమనించిన స్థానికులు ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై దాడికి ప్రయత్నించారు.

ఇంతలో సమాచారం అందుకున్న టూటౌన్‌ ఎస్సై ఎస్‌ఎస్‌ఆర్‌ గంగాధర్‌ తన సిబ్బందితో అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఏలూరు ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అదే సమయంలో అక్కడికి చేరుకున్న ఏలూరు డీఎస్పీ గోగుల వెంకటేశ్వరరావు, ట్రాఫిక్‌ డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండా బందోబస్తు నిర్వహించారు. ఘటనకు కారణమైన వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అతడి నుంచి ఎటువంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement