కవిటం (పోడూరు): చేపల వేటకు వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొని అక్కడికక్కడే మృతిచెందాడు. కవిటం వద్ద పాలకొల్లు–మార్టేరు రహదారిపై ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కావడి వెంకటేశ్వరరావు(50) మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. పాలకొల్లు బెత్లహోమ్పేటకు చెందిన కావడి వెంకటేశ్వరరావు చేపలు పట్టి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం నరసాపురం ప్రధాన కాలువలో చేపల వేటకు కవిటం ప్రాంతానికి వెళ్లాడు. ఉదయం అక్కడ చేపలు వేటాడి మధ్యాహ్నం సమయంలో ఎఫ్సీఐ గోడౌన్ సమీపంలో రోడ్డు దాటుతుండగా పాలకొల్లు వైపు మెటల్ లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టి పంట బోదెలోకి బోల్తా కొట్టింది. దీంతో వెంకటేశ్వరరావు అక్కడికక్కడే మృతిచెం దాడు. ఎస్సై డి.ఆదినారాయణ ఘటనాస్థలిని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. మృతునికి భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
చేపల వేటకు వెళ్లి మృత్యుఒడిలోకి..
Published Mon, Aug 29 2016 1:26 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
వేసవి దుక్కులతో మేలు
ఈవీఎంల రెండో అదనపు సప్లిమెంటరీ ర్యాండమైజేషన్
ప్రతి సర్కిల్లో కంట్రోల్ రూం
సవాళ్లను ఎదుర్కొని నిలదొక్కుకోవాలి
బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలవబోతోంది
నేడు వరంగల్కు ప్రధాని రాక
పోలింగ్ కేంద్రాల సామగ్రిని పరిశీలించిన కమిషనర్
వర్ష బీభత్సం
ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి
తప్పక చదవండి
Advertisement