శ్రీవారి దేవస్థానానికి రూ.1.27 లక్షల విరాళం | Sakshi
Sakshi News home page

శ్రీవారి దేవస్థానానికి రూ.1.27 లక్షల విరాళం

Published Wed, Aug 10 2016 9:13 PM

శ్రీవారి దేవస్థానానికి రూ.1.27 లక్షల విరాళం

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానానికి ఓ భక్తుడు బుధవారం రూ.1.27 లక్షల విరాళం అందజేశారు. భీమడోలు మండలం పూళ్ల గ్రామానికి చెందిన కల్లి నారాయణ అప్పారావు స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం  నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.1,00,008, ఆలయ విమానగోపుర స్వర్ణమయ పథకానికి రూ.27,000 మొత్తం రూ.1,27,008ను ఆలయ చైర్మన్‌ ఎస్వీ సుధాకరరావుకు అందజేశారు. దాతకు చైర్మన్‌ సుధాకరరావు, ఈవో వేండ్ర త్రినాథరావు అభినందించి విరాళం బాండ్లు అందజేశారు. 
 
 
 

Advertisement
Advertisement