కొండపల్లి బొమ్మల పరిశ్రమకు రూ.1.75 కోట్లు | Sakshi
Sakshi News home page

కొండపల్లి బొమ్మల పరిశ్రమకు రూ.1.75 కోట్లు

Published Thu, Sep 15 2016 10:02 PM

కొండపల్లి బొమ్మల పరిశ్రమకు రూ.1.75 కోట్లు

ఇబ్రహీంపట్నం : కొండపల్లి బొమ్మల తయారీ పరిశ్రమ కళాకారుల అభ్యున్నతి కోసం కేంద్రం ప్రభుత్వం రూ.1.75కోట్లు విడుదల చేసిందని డీఆర్‌డీఏ పీడీ డి.చంద్రశేఖర్‌రాజు తెలిపారు. కొండపల్లి గ్రామంలో బొమ్మలు తయారు చేసే కళాకారులతో డీఆర్‌డీఏ ఆధ్వర్యాన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండపల్లి బొమ్మల తయారీదారులను ఒక సొసైటీగా ఏర్పాటు చేసి డీఆర్‌డీఏ, లేపాక్షి, టాటా ట్రస్ట్‌ ద్వారా ముడిసరుకు అందజేస్తామన్నారు. బొమ్మల నాణ్యత, ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌లో అమ్మకాలపై శిక్షణ ఇస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో టాటా ట్రస్ట్‌ ప్రతినిధి సోహిని, మండల ఏపీఎం కృష్ణంరాజు, క్లస్టర్‌ కో–ఆర్డినేటర్‌ రుక్మిణి పాల్గొన్నారు. 
 
 
 

Advertisement
Advertisement