ఏపీకి రూ. 280 కోట్లు కరవు సాయం: కేంద్రం | Sakshi
Sakshi News home page

ఏపీకి రూ. 280 కోట్లు కరవు సాయం: కేంద్రం

Published Mon, Feb 15 2016 5:56 PM

Rs 280 crore assistance for Andhra pradesh: Central govt

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కరవు సాయంగా 280 కోట్ల రూపాయలను కేంద్రం ప్రకటించింది. ఈ మేరకు కేంద్రం సోమవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది ఏపీ రాష్ట్రంలో 359 మండలాల్లో తీవ్ర కరవు పరిస్థితులు తలెత్తాయి. దాని దృష్ట్యా కరవు బాధిత ప్రాంతాలకు 2 వేల కోట్ల రూపాయలు కావాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. అయితే ఏపీ రాష్ట్రానికి కేంద్రం 280 కోట్లను కరవు సాయంగా ప్రకటించినట్టు పేర్కొంది.

Advertisement
Advertisement