ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా: ప్రయాణికులు క్షేమం

Published Sat, Sep 3 2016 10:05 AM

rtc bus overturned in vizianagaram district

విజయనగరం : విజయనగరం జిల్లా కురుపాం మండలం ధర్మలక్ష్మీపురం వద్ద శనివారం ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. స్థానికులు వెంటనే స్పందించి... బస్సులోని ప్రయాణికులకు బయటకు లాగారు. బస్సు పార్వతీపురం నుంచి సాకి వెళ్తుండగా ఈ బస్సు ప్రమాదం జరిగిందని తెలిపారు. బస్సు డ్రైవర్ అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 60 మంది ఉన్నారు.

Advertisement
Advertisement