Sakshi News home page

ఆర్టీసీ వరంగల్‌ ఆర్‌ఎంగా సూర్యకిరణ్‌

Published Fri, Aug 5 2016 12:19 AM

RTC Warangal  rm suryakiran

హన్మకొండ : టీఎస్‌ ఆర్టీసీ వరంగల్‌ రీజినల్‌ మేనేజర్‌గా తోట సూర్యకిర ణ్‌ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేస్తున్న ఇ.యాదగిరి సనత్‌నగర్‌ రీజినల్‌ మేనేజర్‌గా బదిలీ అయ్యారు. ఈ స్థానంలో హైదరాబాద్‌ బస్‌ భవన్‌లో పని చేస్తున్న ఎం.వెంకటేశ్వర్‌రావును వరంగల్‌ ఆర్‌ఎంగా బదిలీ చేయగా ఆయన బాధ్యతలు స్వీకరించకుండా దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి నేటి వరకు రెండు నెలలుగా వరంగల్‌ డిప్యూటీ సీటీఎం జి.ఎస్‌.ఎస్‌.సురేష్‌ ఇన్‌చార్జి ఆర్‌ఎంగా బాధ్యతలు స్వీకరించారు. సనత్‌నగర్‌ డివిజనల్‌ మేనేజర్‌గా పని చేస్తున్న తోట సూర్యకిరణ్‌కు రీజినల్‌ మేనేజర్‌గా పదోన్నతి కల్పించి ఖాళీగా ఉన్న వరంగల్‌కు బదిలీ చేశారు. కాగా గురువారం హన్మకొండలోని రీజినల్‌ మేనేజర్‌ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించారు. తోట సూర్యకిరణ్‌ డిపో మేనేజర్‌ నుంచి డివిజనల్‌ మేనేజర్‌గా పదోన్నతి పొంది వరంగల్‌లోనే మొదటి పోస్టింగ్‌ తీసుకున్నారు. ఆర్‌ఎంగా పదోన్నతి పొంది మొదటి పోస్టింగ్‌ వరంగల్‌లోనే తీసుకున్నారు. 2006 నుంచి 2008 వరకు ఇక్కడ డివిజనల్‌ మేనేజర్‌గా పని చేశారు. 1992లో డిపో మేనేజర్‌గా ఆర్టీసీలో ఉద్యోగంలో చేరారు. అనంతరం కలెక్టర్‌ వాకాటి కరుణ, నగర పోలీసు కమిషనర్‌ జి.సుధీర్‌బాబు, రూరల్‌ ఎస్పీ అంబర్‌ కిశోర్‌ఝాను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.  

Advertisement
Advertisement