* నందనవనంలా ఎస్.కోట ఫైర్ స్టేషన్
* సకల సౌకర్యాల కల్పన
* అందరి సహకారంతో అభివృద్ధి
శృంగవరపుకోట: ఆహ్లాదకర వాతావరణం.. ఆప్యాయంగా మాట్లాడే సిబ్బంది.. అగ్ని ప్రమాదాలపై ప్రజలను అవగాహన కల్పించేందుకు సదస్సులు.. ఇలా శృంగవరపుకోట ఫైర్స్టేషన్ జిల్లాలో ‘ఫైన్ స్టేషన్’గా అభివృద్ధి చెందింది. ఐదేళ్ల క్రితం ఈ అగ్ని మాపక శాఖ కార్యాలయం అధ్వానంగా ఉండేది. బూత్బంగ్లా మాదిరిగా మందుబాబులకు, పేకాటరాయుళ్లకు కేరాఫ్ అడ్రస్గా గుర్తింపు పొందింది.
పైకప్పు సిమెంట్ రేకులు పగిలిపోయి వర్షం వస్తే కారిపోయేది. ఆవరణమంతా పిచ్చిమొక్కలతో ఉండేది. అటువంటి ఈ ఫైర్ స్టేషన్కు ఎఫ్వోగా 2011 ఆగస్టులో రామచంద్ర వచ్చారు. ఆయన స్టేషన్ అభివృద్ధిపై దృష్టి సారించారు. ముందుగా ప్రభుత్వ నిధులు రూ.5లక్షలతో ప్రహరీ నిర్మించి గేటు ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత రెస్ట్ రూము, కార్యాలయ గదులకు మరమ్మతులు చేశారు. మరుగుదొడ్లు, ట్యాంక్ నిర్మించారు. స్టేషన్ ఆవరణలోని పిచ్చిచెట్లు తొలగించి పూలమొక్కలు నాటించారు. సిబ్బంది కోసం షటిల్ కోర్టు, తాగునీటి కుళాయిలు, గ్యాస్ స్టౌ, వాటర్ ఫిల్టర్, టీవీ వంటివి ఏర్పాటు చేశారు. స్టేషన్ను నందనవనంలా తీర్చిదిద్దారు.
అవగాహన కార్యక్రమాల నిర్వహణ
అగ్ని ప్రమాదాలపై అవగాహన కల్పించేందుకు ఫైర్స్టేషన్ సిబ్బంది ప్రజాప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు, విద్యార్థులు, కార్మికులతో పలు సదస్సులు నిర్వహించి అందరి అభినందనలు పొందారు. ఇటీవల ఎస్.కోట వచ్చిన డీఎఫ్వో స్వామి కూడా ఫైర్స్టేషన్ నిర్వహణ తీరుపై ఆనందం వ్యక్తంచేశారు. నాటి విశాఖ ఎంపీ పురంధేశ్వరి, ఎమ్మెల్యే లలితకుమారి, రఘురాజు, మళ్ల గణేష్, స్థానిక వర్తక సంఘం, ప్రయివేటు పాఠశాలల యాజమాన్యం, స్టోన్ క్రషర్స్ అసోషియేషన్, మీడియా మిత్రుల సహకారంతో అభివృద్ధి సాధ్యమైందని ఎఫ్వో రామచంద్ర తెలిపారు.
'ఫైన్' స్టేషన్
Published Fri, Jun 24 2016 11:59 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement