పండగ వేళ విషాదం అలుముకుంది. వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలకు తీరని వేదన మిగిల్చారు.
పుట్టినరోజు వేడుకకు వెళ్లి వస్తూ..
తాళ్లపూడి : అన్నదేవరపేట నుంచి∙చిట్యాల వెళ్లే రోడ్డుపై మంగళవారం జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసుల కతనం ప్రకారం.. వేగేశ్వరపురం గ్రామానికి చెందిన నరసింహమూర్తి(42) మంగళవారం చిట్యాల గ్రామంలోని బంధువుల ఇంట జరిగిన పుట్టిన రోజు వేడుకకు వెళ్లాడు. తిరిగి మోటార్సైకిల్పై తాళ్లపూడివైపు వస్తుండగా ప్రమాదవశాత్తూ.. రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును ఢీకొట్టడంతో బలమైన గాయాలయ్యాయి. దీంతో నరసింహమూర్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మోటార్సైకిల్పై వెనుక కూచ్చుని మరోవ్యక్తి స్వల్పంగా గాయపడ్డాడు. నరసింహమూర్తికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తాళ్లపూడిలో సెలూన్ నిర్వహిస్తూ.. కుటుంబాన్ని పోషిస్తున్నారు. నరసింహమూర్తిపైనే అతని తల్లి, సోదరిలూ ఆధారపడి జీవిస్తున్నారు. అతని మృతితో వారంతా దిక్కులేనివారయ్యారు. తీవ్రంగా రోదిస్తున్నారు.
బైక్పై నుంచి జారిపడి మహిళ మృతి
వేడంగి(పోడూరు) : వేడంగి వద్ద మంగళవారం రాత్రి బైక్పై వెళ్తుండగా, వెనుక కూర్చున్న మహిళ ప్రమాదవశాత్తూ జారిపడి మృతిచెందింది. ఎస్ఐ డి.ఆదినారాయణ కథనం ప్రకారం.. అత్తిలి మండలం కొమ్మలి గ్రామానికి చెందిన దాసరి వరలక్ష్మి(35) వరుసకు కొడుకైన ముద్దాడ వీరబాబుతో కలసి ద్విచక్రవాహనంపై రాత్రి 8 గంటలకు పాలకొల్లులోని బంధువుల ఇంటికి వెళ్తున్నారు. వీరు వేడంగి వచ్చేసరికి ద్విచక్రవాహనంపై వెనుక కూర్చున్న వరలక్ష్మి ప్రమాదవశాత్తూ జారి కిందపడిపోయింది. ఈ ప్రమాదంతో ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను 108 వాహనంలో పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా మార్గమద్యంలో మృతిచెందింది. వరలక్ష్మి తండ్రి దిండి పైడియ్య పిర్యాధు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ఆదినారాయణ తెలిపారు.
వీరవాసరం వద్ద రోడ్డు ప్రమాదంలో యువకుడు..
వీరవాసరం : పంజా వేమవరం సమీపంలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం.. పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామానికి చెందిన జిన్నె సూర్యభాస్కర్ (23) మోటార్ బైక్పై మరో ఇద్దరితో కలిసి వెళ్తుండగా, పెనుమంట్ర – వీరవాసరం రహదారిపై పంజా వేమవరం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ను దాటుతుండగా వీరవాసరం నుంచి పెనుమంట్ర వైపు ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు మోటార్సైకిల్ను పక్కగా ఢీకొట్టింది. దీంతో బైక్పై ఉన్నవారు ట్రాక్టర్వైపునకు పడిపోయారు. ట్రాక్టర్ ట్రాక్కు సూర్యభాస్కరాన్ని సుమారు 50 అడుగుల మేర లాక్కుని వెళ్లిపోవడంతో అతను అక్కడికక్కడే మరణించాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సూర్యభాస్కర్ మృతదేహంపై అతడి తండ్రి జిన్నె ఆదినారాయణ పడి రోదిస్తున్న దృశ్యం చూపరులను కలచివేసింది. ఇంజనీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం యత్నాల్లో ఉన్న సూర్యభాస్కర్ రోడ్డు ప్రమాదంలో మరణించడంతో అతని కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగిపోయారు.
లారీ చెట్టును ఢీకొని మహిళ మృతి
దేవరపల్లి: దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవానీ మాల ధరించిన అప్పలబత్తుల విమల(30) మృతిచెందింది. పోలీసుల కథనం ప్రకారం విశాఖ జిల్లా కసింకోట మండలం నర్శిపల్లికి చెందిన అప్పలబత్తుల విమల, మరికొంత మంది మహిళలు భవానీ మాల వేసుకున్నారు. మంగళవారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి బయలుదేరారు. ఆరుగురు భవానీలు కలిసి ఇనుప దిమ్మలలోడుతో వెళ్తున్న లారీ ఎక్కారు. లారీ దేవరపల్లి మండలం గౌరీపట్నం వద్ద ఆటోను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును Éీ కొంది. ఈ ప్రమాదంలో ఇనుప దిమ్మలు తగిలి విమల మృతి చెందింది. ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన మహిళలను చికిత్స కోసం రాజమండ్రి ఆసుపత్రికి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సి.హెచ్.ఆంజనేయులు తెలిపారు.
భవనంపై నుంచి జారిపడి..
భీమవరంటౌన్ : భవనంపై నుంచి జారిపడి ఓ కార్మికుడు మృతిచెందాడు. పోలీసుల కథనం ప్రకారం.. స్థానిక జువ్వలపాలెం రోడ్డులోని కాస్మోపాలిటన్క్లబ్ సమీపంలో కొత్తగా నిర్మిస్తున్న భవనం పైనుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికుడు కె.విఘ్నేశ్వరరావు(28)బుధవారం మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు టుటౌన్ ఎస్సై బి.సురేంద్రకుమార్ తెలిపారు. పూర్తివివరాలు తెలియరావాల్సి ఉంది.