నీటి బకెట్లో పడి చిన్నారి దుర్మరణం | Sakshi
Sakshi News home page

నీటి బకెట్లో పడి చిన్నారి దుర్మరణం

Published Tue, Jun 14 2016 1:38 AM

నీటి బకెట్లో పడి చిన్నారి దుర్మరణం

తల్లడిల్లిన కుటుంబ సభ్యులు
తూప్రాన్‌లో ఘటన

 తూప్రాన్:ఆడుకుంటూ వెళ్లిన ఆ చిన్నారి నీటి బకెట్‌లో పడి ప్రాణాలు విడిచాడు. ఈ దుర్ఘటన తూప్రాన్‌లో సోమవారం చోటు చేసుకుంది. పట్టణానికి  చెందిన జ్యోతి, శ్రీను దంపతులు అభ్యాస స్కూల్ ఎదురుగా డేరాల్లో నివసిస్తున్నారు. వీరి కి కళ్యాణ్ అనే ఏడాదిన్నర వయస్సు గల బాబు ఉన్నాడు. వీరు రోడ్ల పక్కన చెత్తను సేకరించి వాటితో వచ్చిన డబ్బుతో జీవిస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం వారిది. రోజు మాదిరిగా తండ్రి శ్రీను చెత్తకాగితాల సేకరణకు వెళ్లాడు.

ఇంటి వద్దే ఉన్న తల్లి బాబుకు పాలిచ్చి అలాగే నిద్రపోయింది. తల్లి పక్కలోంచి లేచిన బాలుడు కళ్యాణ్ ఆడుకుంటూ ఇంటి ముందు ఉన్న ప్లాస్టిక్ బకెట్ వైపు వెళ్లాడు. ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృత్యవాత పడ్డాడు. కాసేపటికి నిద్రనుంచి తేరుకున్న జ్యోతి తన కుమారుడి గురించి పక్కనున్న డేరాల్లో వెతి కింది. అక్కడ కనిపించలేదు. ఇంటి ముందు ఉన్న బకెట్లో తలకిందులుగా పడి ఊపిరాడక మృతి చెంది పడి ఉన్నాడు. దీంతో ఆ తల్లి తన కుమారుడి మృతదేహాన్ని బయటకు తీసి గుండెలకు హత్తుక్కుని బోరున విలపించింది.  చుట్టుపక్కల వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తల్లి విలపించిన తీరు అక్కడున్న వారిని సైతం కంటతడి పెట్టించింది.

Advertisement
Advertisement