పేద విద్యార్థులకు ‘సంజీవని‘ చేయూత | Sakshi
Sakshi News home page

పేద విద్యార్థులకు ‘సంజీవని‘ చేయూత

Published Fri, Jul 29 2016 10:09 PM

sanjeevani helps to poor students

అనంతపురం సెంట్రల్‌ : పేద విద్యార్థులకు   సంజీవని రక్తదాతల సంస్థ చేయూతనిచ్చింది.  కలెక్టరేట్‌కు ఎదురుగా ఉన్న అనంతసాగర్‌ కాలనీలో పేద విద్యార్థులకు స్కూల్‌ బ్యాగులు, పలకలు, నోట్‌బుక్స్, పెన్నులు తదితర వస్తువులను సంస్థ నిర్వాహకులు రమణారెడ్డి ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.

జిల్లా ఎస్పీకి సీసీగా పనిచేస్తున్న మురళీమోహన్‌ కుమారుడు నిఖిల్‌ పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు  వివరించారు. కార్యక్రమంలో స్కూల్‌ టీచర్స్‌ నాగSసరోజినిదేవీ, త్రివేణి, కానిస్టేబుల్స్‌ కిరణ్, సత్యనారాయణ, శివ, సాయి  పాల్గొన్నారు.  

Advertisement
Advertisement