పెనుకొండ: వేరుశనగ పంట ఎండుతున్న విషయం తెలియదని ముఖ్యమంత్రి ప్రకటించడాన్ని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుండ్ల శంకరనారాయణ తప్పుబట్టారు. ఇందుకు బాధ్యులుగా మంత్రులు, అధికారులను చూపుతున్నారన్నారు. మంత్రులను బర్త్రఫ్ చేసి, అధికారులపై చర్యలు తీసుకునే ధైర్యం ముఖ్యమంత్రికి ఉందా? అని ఆయన ప్రశ్నించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలే కరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 12 మంది ఎమ్మెల్యేలు, 2 ఎంపీలను గెలిపించిన ఈ జిల్లాకు ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదన్నారు. గత 20 రోజులకు పైగా వైఎస్సార్సీపీ, కమ్యూనిస్ట్ పార్టీలు తీవ్ర వర్షాభావంతో వేరుశనగ ఎండుతోందని పదేపదే అధికారులకు విన్నవించినా ఎలాంటి స్పందన లేదన్నారు.
రెయిన్గన్లు, ఫారంపాండ్స్ అపహాస్యమై నీరుగారిపోయాయన్నారు. ఈ సమయంలో తన ప్రతిష్ట మసకబారకుండా ఉండటానికే కరువు పరిస్థితి తన దృష్టికి రాలేదంటున్నారని ఆయన పేర్కొన్నారు. వేరుశనగ పంట వేసి నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ. 20 వేలు నష్టపరిహారం ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కృష్ణా జలాలను హంద్రీనీవా ద్వారా జిల్లాకు అందించి జిల్లాను సస్యశ్యామలం చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న హంద్రీనీవా పనులన్నిటినీ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
మంత్రులను బర్త్రఫ్ చేసే ధైర్యముందా ?
Published Mon, Aug 29 2016 10:26 PM
Advertisement
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement