సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : పెద్దనోట్లు రద్దు అయిన నెల తర్వాత కూడా పరిస్థితుల్లో మార్పులేదు. ప్రజల కష్టాలు తగ్గలేదు. సామాన్యుల పరిస్థితి దినదినగండంగా మారింది. బ్యాంకుల ముందు నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. అధికశాతం ఏటీఎంలు మూతపడే ఉంటున్నాయి. ఫలితంగా ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పలుచోట్ల వారు రోడ్డెక్కి ఆందోళనకు దిగాల్సిన దుస్థితి నెలకొంది. తాజాగా గురువారం యలమంచిలి, కైకరం బ్యాంకుల్లో నగదు నిల్వలు నిండుకోవడంతో ’సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం కరెన్సీని పూర్తిగా రద్దు చేయలేదని, ప్రస్తుతం నెలకొన్న ఇబ్బందులను అధిగమించేందుకే నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధానం వల్ల రైతులకు, చిన్న వ్యాపారులు, చిరుద్యోగులకు కొన్ని ఇబ్బందులు ఉన్న విషయం వాస్తవమేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఏటీఎంలలో పూర్తిస్థాయిలో నగదు ఉంచడం, చిన్ననోట్లు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు యత్నిస్తున్నట్టు చెప్పారు. ప్రస్తుతం ఏటీఎంల నిర్వహణలో కొంత నిర్లక్ష్యం ఉందని, బ్యాంకుల్లో వారానికి రూ. 24వేలు ఉపసంహరణ పరిమితి నిర్దేశించినప్పటికీ సక్రమంగా అమలు కాకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలపై విస్తృత ప్రచారం చేపట్టిందన్నారు. దీనివల్ల ధరల స్థిరీకరణకు అవకాశం ఉందని, భవిష్యత్తులో ఈ–బ్యాంకింగ్ అందుబాటులోకి రావడం ద్వారా లావాదేవీలు మరింత సులభతరమవుతాయని ఆయన పేర్కొన్నారు. పెద్ద నోట్ల రద్దు వల్ల బినామీలు, అక్రమ ఆస్తులు కలిగి ఉన్న వారు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కొవ్వూరు మున్సిపల్ చైర్మ¯ŒS జొన్నలగడ్డ రాధారాణి, అసిస్టెంట్ లేబర్ కమిషనర్ కేఎస్వీ సత్యన్నారాయణ, ఎంపీడీవో ఎ.రాము, మున్సిపల్ మాజీ వైస్చైర్మ¯ŒS పరిమి హరిచరణ్, టీడీపీ రాష్ట్ర తెలుగు రైతు కార్యనిర్వాహక కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, స్పెషల్ గ్రేడ్ ఏఎంసీ కార్యదర్శి ఏఆర్కే ప్రకాష్, మున్సిపల్ వైస్ చైర్మ¯ŒS దుద్దుపూడి రాజారమేష్, మున్సిపల్ టీపీవో పి స్వరూపారాణి, అసిస్టెంట్ ఏసీటీవో ఎంఎస్ ప్రకాశరావు, ఏపీఎం ఇ.మహాలక్ష్మి, సీడీపీవో వైబీటీ సుందరి, ఈవోపీఆర్డీ కె. జా¯ŒSలింకన్, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు గ్రంధి వీరభద్రస్వామి(భద్రం), సీనియర్ సిటిజన్స్ సంఘం అధ్యక్షుడు పులపా సత్యన్నారాయణ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ నాయకులు చిలంకుర్తి వెంకట సుబ్బారావు(బాబి), రైస్ అండ్ కిరాణా మర్చంట్స్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ఎంబీఎస్ ప్రసాద్(దత్తుడు), సీఐటీయూ నాయకులు ఎంఎం సుందరబాబు, దగ్గు రాధాకృష్ణ, మాజీ ఏఎంసీ చైర్మ¯ŒS మట్టే నారాయణమూర్తి, పాకా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
సంక్షోభ నివారణకే నగదు రహితం
Published Fri, Dec 9 2016 2:37 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
Advertisement