ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు పట్టణంలోని హోల్సేల్ దుకాణదారుల నుంచి బంగారంతో ఉడాయించిన వ్యాపారి ఆచూకీ ఇంత వరకూ లభ్యం కాలేదు. సుదర్శన్రెడ్డి అనే వ్యాపారి నాలుగు కిలోల బంగారంతో ఈ నెల 7న ఉడాయించిన విషయం విదితమే. తన దుకాణానికి ఆసాములు వచ్చారని అతను హోల్సేల్ దుకాణ దారులైన దౌలా వద్ద నుంచి 1 కిలో, హనీఫ్ షాపులో నుంచి 3కిలోల బంగారు ఆభరణాలను తీసుకొని వెళ్లాడు. సాధారణంగా అయితే ఎవరైనా బంగారు ఆభరణాలు తీసుకొని వెళ్తే రెండు, మూడు గంటల్లో తిరిగి వారి వారి దుకాణాలకు పంపిస్తారు. అయితే ఇతను మాత్రం సాయంత్రమైనా తిరిగి తీసుకొని రాకపోవడంతో అనుమానం వచ్చిన హోల్సేల్ వ్యాపారులు సుదర్శన్రెడ్డి షాపు వద్దకు వెళ్లగా మూసి ఉంది. ఫోన్ చేసినప్పటికీ అతని సెల్ ఆఫ్లో ఉంది. దీంతో వ్యాపారులిద్దరూ అదే రోజు రాత్రి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
లబోదిబో మంటున్న ప్రజలు..
ఈ నాలుగు కిలోల బంగారు ఆభరణాలే గాక చాలా మంది ప్రజలు, బంగారు వ్యాపారులు కూడా అతనికి వస్తువులు తయారు చేయమని బంగారు ఇచ్చినట్లు చెబుతున్నారు. అతను ఉడాయించడంతో వారు లబోదిబో మంటున్నారు. చాలా మంది సుదర్శన్రెడ్డి దుకాణం చుట్టూ తిరుగుతున్నారు. ఒకరిద్దరు ఇలా మోసాలకు పాల్పడటం వల్ల అందరికీ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిన్న చిన్న దుకాణదారులు వాపోతున్నారు.
పోలీసుల గాలింపు
బంగారంతో ఉడాయించిన సుదర్శన్రెడ్డి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే అతనికి సంబంధించిన ఫొటోలను ఇతర జిల్లాల పోలీస్ స్టేషన్లకు పంపించారు. అతనికి బంగారు ఇచ్చిన బాధితులు నిత్యం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. కాగా అతను దేశం విడిచి పోయినట్లు వార్తలు కూడా వస్తున్నాయి. అయితే బంగారు వ్యాపారులు మాత్రం అతను ఇతర దేశాలకు వెళ్లే అవకాశం లేదని చెబుతున్నారు. అతని వద్ద సుమారు 5 కిలోల బంగారు దాకా ఉందని, అంత బంగారంతో అతను ఎక్కడికీ వెళ్లలేడని అంటున్నారు. ఇతర జిల్లా, లేక ఇతర రాష్ట్రాల్లో తలదాచుకొని ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను పోలీసులు విచారించినప్పటికీ ఫలితం లేదు. అతనితో సన్నిహితంగా ఉంటున్న వ్యక్తులను కూడా పోలీసులు విచారించారు. రోజులు గడిచే కొద్దీ ఏమవుతుందోనని బంగారు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. అతని వద్ద అంత బంగారం ఉందని తెలిస్తే అతని ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని కూడా పోలీసులు, బంగారు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై డీఎస్పీ పూజితా నీలంను వివరణ కోరగా సుదర్శన్రెడ్డి కోసం గాలిస్తున్నామని చెప్పారు.
బంగారు వ్యాపారి కోసం గాలింపు
Published Wed, Oct 26 2016 2:03 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement