కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల ఆందోళన | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న రెండో ఏఎన్‌ఎంల ఆందోళన

Published Mon, Aug 1 2016 9:57 PM

second anm's agitations are continuing

నిర్మల్‌టౌన్‌ : పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట నిర్వహిస్తున్న రెండో ఏఎన్‌ఎంల సమ్మె సోమవారం నాటికి 15వ రోజుకు చేరింది. ఇందులో భాగంగా వంటావార్పు కార్యక్రమం నిర్వహించిన రెండో ఏఎన్‌ఎంలు తమ నిరనసను తెలిపారు. వెంటనే తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలన్నారు. తమతో వెట్టిచాకిరి చేయించుకుంటున్న ప్రభుత్వం కనీస వేతనం ఇవ్వడం లేదని వారు ఆరోపించారు. సమస్యలతో తాము సతమతమవుతున్నా ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు.
         ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. ఇందులో సీఐటీయూ నాయకులు సుంకు ఆనంద్, ఏఎన్‌ఎంలు మంజుల, పుష్ప, శోభ, ఫాతిమ, విజయలక్ష్మీ, స్వరూప తదితరులు పాల్గొన్నారు.
 
 

Advertisement
Advertisement