♦ తలకు తీవ్ర గాయంతో ఆస్పత్రిలో చేరిన మరో యువకుడు పని చేయని సెల్ఫోన్లు
♦ 24 గంటల సస్పెన్స్ తర్వాత క్షేమంగా ఉన్నట్లు సమాచారం
బోట్క్లబ్ (కాకినాడ)/ కాకినాడ సిటీ: తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నుంచి కాశీ యాత్రకు వెళ్లిన ఏడుగురు ఆదృశ్యమయ్యారు. తమ వారు ఏమై పోయారోనని వారి బంధువులు తల్లడిల్లిపోయారు. మంగళవారం పొద్దుపోయాక వారు క్షేమంగా ఉన్నట్లు తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. కాకినాడ గాంధీనగర్ ఎల్విన్పేటకు చెందిన డొక్కరి అప్పల నర్సమ్మ (50), డొక్కరి లోవరాజు (27), నమ్మి నారాయణమ్మ (70), గొర్ల మంగమ్మ (50), సర్వసిద్ధి అప్పారావు (75), సర్వసిద్ధి పేరంటాళ్లు (65), నరాల లక్ష్మి (50), బత్తిన మాణిక్యమ్మ (50) గత నెల 29న కాకినాడ నుంచి విజయవాడ మీదుగా రైలులో ఆదివారం కాశీ చేరుకున్నారు.
సోమవారం కాశీ సమీపంలోని పుణ్యక్షేత్రాల సందర్శనకు వెళ్తున్నట్టు బంధువులకు చెప్పారు. దారిలో ఏం జరిగిందో తెలీదు కానీ, లోవరాజు మినహా మిగతా వారి ఆచూకీ తెలియడం లేదు. లోవరాజు వారణాశిలోని కబీర్చోరా ప్రాంతంలోని ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం అతడు అపస్మారక స్థితిలో ఉన్నట్లు అక్కడి వైద్యులు ఫోన్లో తెలిపారని బంధువులు చెబుతున్నారు. మిగిలిన ఏడుగురి ఫోన్లు మూగపోవడంతో బంధువుల్లో ఆందోళన మొదలైంది. ‘అసలు వారి ఫోన్లు ఎందుకు పని చేయడం లేదు.. వారికి ఏమైంది.. లోవరాజు సెల్ ఫోన్ రింగవుతున్నా ఎవరూ తీయడం లేదు.. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెబుతార’ంటూ వారు కన్నీటి పర్యంతమవుతున్నారు.
లోవరాజు అపస్మారక స్థితిలోకి వెళ్లక ముందు వైద్యుని ఫోన్తో తమతో మాట్లాడాడని, తనతో ఉన్న వారిని ఎవరో చంపేశారని చెప్పి ఫోన్ పెట్టేశాడన్నారు. వివరాలు సరిగా చెప్పలేదని బంధువులు చెప్పారు. లోవరాజు తలకు గాయంతో ఆస్పత్రికి వచ్చాడని.. ఏం జరిగిందో స్పష్టంగా చెప్పలేకపోతున్నాడని వైద్యుడు చెప్పారన్నారు. తమ వాళ్లు ప్రమాదానికి గురయ్యారా.. లేక దారి దోపిడీలో ప్రతిఘటించి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారా.. అనేది అర్థం కావడం లేదని వారు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్ వద్ద బావురుమన్నారు. అదృశ్యమైన వారి కోసం ఏపీ, యూపీ రాష్ట్ర ప్రభుత్వాలు గాలిస్తుండగా.. తాము క్షేమంగానే ఉన్నామని మంగళవారం పొద్దుపోయాక ఆ ఏడుగురు వారి బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు.
కాశీకి వెళ్లి ఏడుగురి అదృశ్యం
Published Wed, May 4 2016 2:23 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement