Sakshi News home page

షాబాద్‌ మండలాన్నిశంషాబాద్‌ జిల్లాలో కలపాలి

Published Thu, Aug 25 2016 7:16 PM

షాబాద్‌ మండలాన్నిశంషాబాద్‌ జిల్లాలో కలపాలి - Sakshi

షాబాద్‌: షాబాద్‌ మండలాన్ని శంషాబాద్‌ జిల్లాలో కలిపేవరకు అఖిలపక్షం ఆధర్యంలో ఉద్యమాలు  కొనసాగిస్తామని ఎ.రవీందర్‌రెడ్డి, బీసీ సేన రాష్ర్ట అధ్యక్షులు బర్క కృష్ణ యాదవ్ డిమాండ్‌ చేశారు. గురువారం మండల కేంద్రంలోని ఆర్అండ్‌బి అథితి గృహంలో విలేకరుల సమావేశం  ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శుక్రవారం షాబాద్‌ మండలాన్ని శంషాబాద్‌ జిల్లాలో కలిపేంత వరకు బంద్‌ ప్రకటిస్తామన్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, రిలే నిరహార దీక్షలు, ప్రభుత్వ, ‍ప్రయివేటు పాఠశాలలను మూసివేయిస్తామన్నారు. షాబాద్ మండల ప్రాంతం శంషాబాద్‌ కు 30 కిలో మీటర్ల దూరంలో ఉందన్నారు. నిత్యం విద్యా, ఉద్యోగంకోసం శంషాబాద్‌కు ఎక్కువగా వెళ్తుంటారన్నారు. రైతులు ప్రతిరోజు శంషాబాద్‌ మార్కెట్‌కు నిత్యం కూరగాయలు, నిత్యవసర వస్తువుల కోసం వెళ్తుంటారని తెలిపారు. షాబాద్‌ను వికారాబాద్‌ జిల్లాల్లో కలిపితే పెద్దెత్తున ఉద్యమం చేస్తామన్నారు.ఈ కార్యక్రమంలో  మండల వైస్ ఎంపీపీ మంగలి శివకుమార్‌, కాంగ్రెస్ అధ్యక్షులు అంజనేయులుగౌడ్, బీజేపీ నాయకులు రాము, నరేందర్‌రెడ్డి,  సర్పంచులు రవీందర్ నాయక్, శివకుమార్,  మద్దూర్ మల్లేష్, కాంగెస్ నాయకులు తమ్మళి రవీందర్, అష్మత్‌ పాష,  జనార్దన్‌రెడ్డి, పామెన నర్సింలు, మల్లేష్,  జంగయ్య, మాణిక్యప్రభు, అఖిల పక్షం నాయకులు కర్రె శ్రీశైలం, హరిశంకర్, కిరన్, రాపోల్‌ నర్సింలు, మల్లేష్, శివకుమార్, తదితరులున్నారు.   ప్రతాప్‌రెడ్డి,  తదితరులున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement