కరీంనగర్ : ఆత్మహత్యకు పాల్పడ్డ కరీంనగర్ జిల్లా పెద్దపల్లి ఎస్ఐ జగన్మోహన్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తయింది. అనంతరం అతడి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందజేసినట్లు కరీంనగర్ జిల్లా ఎస్పీ జోయల్ డేవిడ్ శనివారం వెల్లడించారు. ఎస్ఐ సూసైడ్ నోట్ను రెవెన్యూ అధికారులకు అప్పగించామని ఆయన తెలిపారు.
పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్ శుక్రవారం రాత్రి తన సర్వీసు రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నారు. 10 నెలల క్రితం పెద్దపల్లి ఎస్సైగా వచ్చిన ఆయన.. 4 రోజుల క్రితమే జమ్మికుంటకు బదిలీ అయ్యారు. ఈ బదిలీపై ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం.