ఎస్సై దాష్టీకం.. యువకులపై లాఠీచార్జ్ | Sakshi
Sakshi News home page

ఎస్సై దాష్టీకం.. యువకులపై లాఠీచార్జ్

Published Fri, Sep 18 2015 3:43 PM

SI p vasu take a lottycharge on youth caused to strike

బంటుమిల్లి(కృష్ణా): యువకులపై ఎస్సై అకారణంగా లాఠీచార్జి చేశారంటూ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలంలో శుక్రవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని జయపురంలో వినాయక ఉత్సవాల సందర్భంగా యువకులంతా శుక్రవారం ఉదయం గ్రామ అరుగులపై కూర్చుని ఉన్నారు. అదే సమయంలో అటుగా వచ్చిన ఎస్సై పి.వాసు యువకులను విచక్షణారహితంగా లాఠీతో కొట్టాడు. దీనిపై గ్రామస్తులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తూ గుడివాడ రహదారిపై బైఠాయించారు.

దీంతో పెద్ద సంఖ్యలో రెండు వైపులా వాహనాలు నిలిచిపోయాయి. వారిని సముదాయించటానికి పెద్దలు ప్రయత్నించారు. అయితే, ఎస్సై వాసు తమ వద్దకు వచ్చి ఎందుకు యువకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారో చెప్పాలని వారు డిమాండ్ చేశారు. సాయంత్రం 3 గంటల వరకు ఆందోళన కొనసాగింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement