► తహసీల్దార్ డిజిటల్ సిగ్నేచర్ను దుర్వినియోగం చేసిన ఘనులు
► నరసరావుపేటలో ఫ్యామిలీ మెంబర్ పత్రం జారీకి భారీగా ముడుపులు
► తహసీల్దార్ ఫిర్యాదు చేసినా కదలని విచారణ
► మూడు నెలలుగా సాగదీత
సాక్షాత్తు మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ డిజిటల్ సిగ్నేచర్ దుర్వినియోగం అయి కేసు నమోదైనా పట్టించుకోని దుస్థితి. కేసు దాఖలు చేసి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ అతీగతీ లేకపోవడం గమనార్హం. నరసరావుపేటలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయంలో జరిగిన ఈ అక్రమంలో అధికార పార్టీ నాయకులు తలదూర్చి నిందితులను విచారించకుండా అడ్డుపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ బాగోతంలో భారీ మొత్తంలో నగదు చేతులు మారినట్లు విశ్వసనీయ సమాచారం. – నరసరావుపేట టౌన్
మండలంలోని రావిపాడుకు చెందిన పుట్టి ఇన్నయ్య గతేడాది జులైలో మృతి చెందాడు. తర్వాత మృతుడి కుమార్తె అమల ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు కోసం దరఖాస్తు చేసుకుంది. విచారణ చేపట్టిన అధికారులు అదే ఏడాది ఆగస్ట్లో సర్టిఫికెట్ కూడా మంజూరు చేశారు. తర్వాత అనూహ్యంగా రమేష్ అనే వ్యక్తి తానూ ఇన్నయ్య కుమారుడినంటూ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా విచారించిన అధికారులు సర్టిఫికెట్ను తిరస్కరించారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు గానీ రమేష్ అనూహ్యంగా సర్టిఫికెట్ పొందాడు. దీనిపై ఇన్నయ్య కుమార్తె అమల మూడు నెలల క్రితం తహసీల్దార్ విజయజ్యోతికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది.
క్రిమినల్ కేసు నమోదు...
ఫిర్యాదు అందిన తర్వాత సదరు తహసీల్దార్ తన డిజిటల్ సిగ్నేచర్ను దుర్వినియోగం చేసి సర్టిఫికెట్ జారీ చేశా>రని తహసీల్దార్ వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తర్వాత కార్యాలయ పరిధిలో కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్ కుమారిపై కేసు దాఖలైంది. తర్వాత కంప్యూటర్ ఆపరేటర్ ప్రసాద్ న్యాయస్థానంలో లొంగిపోయాడు. అనే పరిణామాల పిదప బెయిల్ కూడా పొందాడు.
విచారణ శూన్యం..
కంప్యూటర్ ఆపరేటర్ మినహా మిగతా ఉద్యోగులు, సర్టిఫికెట్ పొందిన రమేష్ అనే వ్యక్తిని ఇప్పటివరకూ విచారించకపోవడం గమనార్హం. కేసును నీరుగార్చేందుకు పోలీసులపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నట్లు తెలుస్తోంది. తప్పు చేసిన వారిని కేసు నుంచి తప్పించేందుకు యత్నిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
శాఖ పరమైన చర్యల్లో రాజకీయం..
సాధారణంగా ఉద్యోగులపై క్రిమినల్ æకేసులు నమోదైతే శాఖ పరమైన చర్యల్లో భాగంగా వారిని విధుల నుంచి తప్పించాల్సి ఉంది. తహసీల్దార్ డిజిటల్ సంతకం దుర్వినియోగం కేసులో నిందితులుగా ఉన్నవారిపై ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. రెవెన్యూ ఉన్నతాధికారులపై కూడా రాజకీయ ఒత్తిళ్లు పనిచేసిన కారణంగానే చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి.
చేతులు మారిన ముడుపులు..
ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ జారీ విషయమై భారీగా ముడుపులు చేతులు మారినట్లు సమాచారం. దీనిలో ఓ వీఆర్వో, కార్యాలయ ఉద్యోగి కలసి ఈ అక్రమానికి పాల్పడినట్లు పట్టణంలో బహిరంగ ఆరోపణలే వినిపిస్తున్నాయి. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ఇద్దరు ఉద్యోగులకు అధికార పార్టీ అండదండలు ఉండటంతోనే విచారణలో జాప్యం జరుగుతుందనే ఆరోపణలు వినవస్తున్నాయి. ఘటన వెలుగులోకి వచ్చి మూడు నెలలు గుడుస్తున్నా ఇప్పటివరకూ ఎలాంటి పురోగతి లేకపోవడం గమనార్హం.
అక్రమ సంతకం కేసు అటకెక్కినట్లేనా?
Published Tue, Aug 22 2017 2:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement