పుష్కరాలకు సహాయ నిరాకరణ | Sakshi
Sakshi News home page

పుష్కరాలకు సహాయ నిరాకరణ

Published Mon, Jul 4 2016 7:21 AM

పుష్కరాలకు సహాయ నిరాకరణ - Sakshi

శివక్షేత్రం పీఠాధిపతి  హెచ్చరిక
విజయవాడ(వన్‌టౌన్) : విజయవాడలో కూల్చివేసిన ఆలయాలను పునర్నిర్మించకుంటే కృష్ణా పుష్కరాలకు రాజధాని పరిసరాల్లో సహాయ నిరాకరణ చేపడతామని శివక్షేత్రం పీఠాధిపతి శివస్వామి హెచ్చరించారు. వన్‌టౌన్‌లోని కొత్తగుళ్లు ప్రాంగణంలో ఆదివా రం ఆయన విలేకరులతో మాట్లాడారు. భారతీయ ధర్మానికి మూలమైన హైందవ సంప్రదాయాలను ఈ ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో అర్ధరాత్రి అక్రమంగా ఆలయాలను కూల్చివేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది హిందూమతంపై జరుగుతున్న దాడిగా ఆయన అభివర్ణించారు. ప్రభుత్వం గూండా ల తరహా పాలన చేస్తోందని దుయ్యబట్టారు. దీనికి కారణమైన ఎంపీ తక్షణం రాజీనామా చేసి ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఆలయాలకు దాతలిచ్చిన భూముల్లో సత్రాలు నిర్మిస్తే ఆ ఆస్తులను ప్రభుత్వం అక్రమంగా విక్రయిస్తోందని ఆయన మండిపడ్డారు.

 నేడు నిరసన ప్రదర్శన
 ఆలయాల కూల్చివేతకు నిరసనగా ధర్మ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యాన సోమవారం విజయవాడలో నిరసన ప్రదర్శన నిర్వహించనున్నట్టు శివస్వామి ప్రకటించారు. 40 మంది పీఠాధిపతుల సారథ్యంలో ఈ ప్రదర్శన జరుగుతుందన్నారు.

 మనోభావాల్ని దెబ్బతీస్తున్నారు : సత్యానందభారతీస్వామి
 గన్నవరం: రోడ్ల విస్తరణకోసం రాష్ట్రప్రభుత్వం ఆలయాల్ని ధ్వంసం చేయ డం రాష్ట్రానికే అరిష్టమని శ్రీభువనేశ్వరీ పీఠాధిపతి సత్యానందభారతీస్వామి పేర్కొన్నారు. ఆది వారం ఆయన కృష్ణాజిల్లా గన్నవరంలో విలేకరులతో మాట్లాడారు. హిందూవుల మనోభావాలను దెబ్బతీసేలా 30కిపైగా దేవాలయాల్ని కూల్చివేయడం దారుణమన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement