లారీ, కారు ఢీ..ఆరుగురికి గాయాలు | Sakshi
Sakshi News home page

లారీ, కారు ఢీ..ఆరుగురికి గాయాలు

Published Mon, Aug 8 2016 7:08 PM

Six injured in road accident

వోలేటివారిపాలెం మండలంలో సోమవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ముందు వెళ్తోన్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోయిన ఓ లారీ ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తోన్న ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురు కందుకూరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా..మరో ముగ్గురు ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులంతా పొన్నలూరు మండలం మాలపాడుకు చెందిన వారిగా గుర్తించారు. ఓ పెళ్లికి హాజరై తిరిగి వెళ్తుండగా పామూరు-కందుకూరు రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement
Advertisement