రైలు నుంచి జారిపడి... | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి...

Published Sun, Sep 18 2016 10:47 PM

రైలు నుంచి జారిపడి...

బీబీనగర్‌ : బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌లో వెళ్తున్న రైలు నుంచి జారి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రైల్వే హెడ్‌ కానిస్టేబుల్‌ కాంతారావు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షేక్‌ బాబు (40) నిజామాబాద్‌ జిల్లాలో పెయింటింగ్‌ పని చేస్తున్నాడు. కాగా, ఆదివారం ఇంటికి వెళ్లేందుకు తెల్లవారుజామున డెల్టా రైలు ఎక్కినట్లు పోలీస్‌లు భావిస్తున్నారు. డోర్‌ వద్ద కూర్చున్న బాబు బీబీనగర్‌ రైల్వే స్టేషన్‌కు రాగానే ప్రమాదవశాత్తు జారి పట్టాలపై పడ్డాడు. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన ఆయనను ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడని తెలిపారు. కాగా, మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రిలో ఉంచారు. మృతుడి జేబులో దొరికిన ఆధారాలను బట్టి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

 

Advertisement
Advertisement