ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం | Sakshi
Sakshi News home page

ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నాం

Published Fri, Sep 2 2016 12:34 AM

Solve the 108 Employes problems

 మహబూబ్‌నగర్‌ న్యూటౌన్‌:సమస్యలతో ప్రజలకు న్యాయం చేయలేకపోతున్నామని, వెంటనే పరిష్కరించాలని 108 ఉద్యోగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో డీఆర్వో భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు.  నాయకులు మాట్లాడుతూ చాలీచాలని డీజిల్‌తో  పది నుంచి 15 కి.మీ. పరిధిలోని కేసులనే తీసుకోవాలని ఆదేశిస్తున్నారని, కానీ ప్రజల నుంచి తమపై ఒత్తిళ్లు పెరిగాయన్నారు. రెండు నెలలుగా జీతాలు ఇవ్వలేదని, సమయానికి జీతభత్యాలు చెల్లించాలని వారు కోరారు. సంఘం జిల్లా అసోసియేట్‌ అధ్యక్షుడు రాంరెడ్డి, నాయకులు మాసన్న, కురుమూర్తి, యాదయ్య, నరేష్, అశోక్, కృష్ణయ్య, బానుప్రకాశ్, వేణు, ఎన్‌.యాదయ్యలు  ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement