హోదా ఇచ్చేందుకు మోదీ సిద్ధంగా లేరు: జేసీ | Sakshi
Sakshi News home page

హోదా ఇచ్చేందుకు మోదీ సిద్ధంగా లేరు: జేసీ

Published Mon, Aug 15 2016 1:44 PM

Special package, but not special status, says MP jc diwakar reddy

అనంతపురం: ప్రత్యేక హోదా అంటే తెలియనివారు చాలామంది ఉన్నారని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సోమవారమిక్కడ మాట్లాడుతూ ఆంధ్రులంతా ప్రత్యేక హోదా కావాలంటున్నారని, అయితే హోదా ఇచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధంగా లేరన్నారు. ప్రత్యేక హోదాతో సమానంగా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. ఏపీకి ఎట్టి పరిస్థితుల్లో హోదా రాదని జేసీ దివాకర్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement