అటవీ ప్రాంతంలో కూంబింగ్‌ | Sakshi
Sakshi News home page

అటవీ ప్రాంతంలో కూంబింగ్‌

Published Sat, Dec 3 2016 11:23 PM

special party police coumbing on forest

బద్వేలు అర్బన్‌ :  మున్సిపాలిటీ పరిధిలోని వల్లెలవారిపల్లెకు తూర్పు భాగాన ఉన్న కొండ ప్రాంతంలోని ఎరశ్రెల అటవీ ప్రాంతంలోకి నెల్లూరు జిల్లాకు చెందిన సుమారు 50 మంది స్పెషల్‌ పార్టీ పోలీసులు శనివారం కూంబింగ్‌కు వెళ్లారు. 10 ఏళ్ల క్రితం (2006 నవంబర్‌10) ఇదే అటవీ ప్రాంతంలో పోలీసుల కాల్పులలో  9 మంది మావోయిస్టులు మృతి చెందారు. ప్రస్తుతం అదే ప్రాంతానికి ఎక్కువ మంది పోలీసులు వెళ్లడంతో.. ఎరక్రూలీల కోసమా, లేక మావోయిస్టుల కదలికలు ఏమైనా ఉన్నాయా అని స్థానికులు చర్చించుకుంటున్నారు. అప్పటి నుంచి ఇంత స్థాయిలో పోలీసులు రాకపోవడంతో.. ఈ రోజు జరిగిన పరిణామం చర్చనీయాంశంగా మారింది.

Advertisement

తప్పక చదవండి

Advertisement