సీఎం ఢిల్లీలో ర్యాలీ చేస్తే హోదా తథ్యం | Sakshi
Sakshi News home page

సీఎం ఢిల్లీలో ర్యాలీ చేస్తే హోదా తథ్యం

Published Mon, Aug 1 2016 10:03 PM

సమావేశంలో మాట్లాడుతున్న  ఆప్‌ సౌత్‌ ఇండియా ఇన్‌చార్జ్‌ సోమనాథ్‌ భారతి - Sakshi

–ఆమ్‌ ఆద్మీ పార్టీ ఏపీ ఇన్‌చార్జ్‌ సోమనాథ్‌ భారతి డిమాండ్‌

తిరుపతి కల్చరల్‌: ప్రత్యేక హోదా తీసుకరావడంలో ముఖ్యమంత్రి విఫలమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదవికి రాజీనామా చేయాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ సౌత్‌ ఇండియా ఇన్‌చార్జ్, డిల్లీ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి డిమాండ్‌ చేశారు. తిరుపతి ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో సోమవారం మాట్లాడారు. చంద్రబాబు, కేసీఆర్, మోడీల మధ్య కుదిరిన రహస్య ఒప్పందంతోనే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా తీసుకరాలేక పోతున్నారని విమర్శించారు. టీటీడీ ఎంపీలతో చంద్రబాబు పార్లమెంట్‌లో అరగంట పోరాడితే ప్రత్యేక హోదా ఇస్తారని స్పష్టం చేశారు. ఆమ్‌ ఆద్మీ ఎంపీ భరత్‌యాన్‌ పార్లమెంట్‌లో ప్రత్యేక హోదాపై పోరాడారని తెలిపారు. తమ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధిని ప్రపంచ వ్యాప్తంగా  చూస్తున్నారని తెలిపారు. ప్రధానంగా విద్య, వైద్య రంగాల్లో విశేషమైన అభివృద్ది సాధించామని, ఇది ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా  నిలిచిందన్నారు. ప్రజలు నీతివంతమైన  పరిపాలన కోరుకుంటన్నారన్నారు.  అవినీతి పరులైన  చంద్రబాబు, కేసీఆర్‌కు పదువులు వచ్చి విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ  ప్రజా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించారన్నారు. ప్రత్యేక హోదాతోనే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ది సాధ్యమని, దీని సాధన కోసం  ఆప్‌ పోరాడుతుందని స్పష్టం చేశారు.  సమావేశంలో ఆయనతో పాటు ఆప్‌ జాతీయ సమితి సభ్యుడు జి.రంజిత్‌కుమార్, జిల్లా కో–కన్వీనర్‌ నీరుగట్టు నగేష్, నాయకులు మనోహర్‌రెడ్డి, అమీన్, వివేక్, గణేష్, రామ్‌మోహన్, అలేష్‌రెడ్డి, లీలాకుమార్, శివ పాల్గొన్నారు.

Advertisement
Advertisement