పొలిటికల్ మైలేజీ పెంచుకుంటాం | Sakshi
Sakshi News home page

పొలిటికల్ మైలేజీ పెంచుకుంటాం

Published Fri, Jul 8 2016 1:18 AM

పొలిటికల్ మైలేజీ పెంచుకుంటాం - Sakshi

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళావెంకట్రావు
సాక్షి, విజయవాడ బ్యూరో: రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో ఉన్న సంతృప్తి స్థాయిలతోపాటు పొలిటికల్ మైలేజీని పెంచుకునేలా పని చేయాలని టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్ణయించినట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ భేటీ అనంతరం కళావెంకట్రావు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రెండేళ్లుగా తమ ప్రభుత్వం, పార్టీ చేపట్టిన కార్యక్రమాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారని చెప్పారు.

అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించామన్నారు. రాజధాని నిర్మాణం, నవనిర్మాణ దీక్ష, సాగునీటి ప్రాజెక్టులు, ప్రభుత్వ పథకాలు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లాయనే దానిపై సమీక్ష జరిపామన్నారు.
 నేడు సీఎం నివాసం నుంచి పల్స్ సర్వే ప్రారంభం: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ చేపట్టనున్న పల్స్ సర్వేను ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం నుంచి శుక్రవారం ప్రారంభించనున్నారు. ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సర్వేను ప్రారంభిస్తారని సమాచార శాఖ అధికారులు తెలిపారు.

Advertisement
Advertisement