రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు ప్రారంభం | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

Published Mon, Feb 27 2017 10:27 PM

రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు ప్రారంభం

రాష్ట్రస్థాయి టెన్నిస్‌ పోటీలు ప్రారంభం
భానుగుడి(కాకినాడ) : టెన్నిస్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ కాకినాడ  ఆధ్వర్యంలో ఆల్‌ ఇండియా నేషనల్‌ ర్యాంకింగ్‌ టాలెంట్‌ సిరీస్‌ అండర్‌–14 బాయ్స్‌ అండ్‌ గరల్స్‌ టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీల కార్యక్రమం సోమవారం గుడారిగుంట మున్సిపల్‌ టెన్నిస్‌ కోర్టులో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి జిల్లా రైస్‌మిల్లర్స్‌ సంఘం అధ్యక్షుడు అంబటి రామకృష్ణారెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా యువ టెన్నిస్‌ క్రీడాకారులను వెలికితీసేందుకు చేస్తున్న గొప్ప ప్రయత్నమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళకు చెందిన 75 మంది క్రీడాకారులు పోటీల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. పోటీల ప్రారంభ వేడుకలో ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ కొల్లిపల్లి రాజేష్‌, టెన్నిస్‌ అసోషియేషన్‌ ఆఫ్‌ కాకినాడ అధ్యక్షుడు జి.శేషగిరి, ప్రధానకార్యదర్శి లక్కరాజు సత్యనారాయణ(టిక్కు) పాల్గొన్నారు.
తొలిరోజు విజేతల వివరాలు..
అల్లూరి వెంకట అభిరామ్‌పై ఎం అనంతమణి(ఏపీ) గెలుపొందగా, వి.ఆనందరెడ్డి రెడ్డిపై ఎన్‌వీ కృష్ణ శ్రీధర్‌రెడ్డి, డి.ప్రణీత్‌ వర్మపై ప్రగతేష్‌ శివశంకర్‌, ముత్తా గౌరవ్‌కృష్ణపై ఆర్‌.శివకార్తీక్‌ రెడ్డి, కొత్త కైలాష్‌పై పి.ధనుష్‌వర్మ, వెంకటదత్తుపై ప్రభుప్రణవ్‌ కుమార్‌, ముత్యాల వినీత్‌పై ఎస్‌డీ అఖిలేష్‌, ఆర్‌.సుకంత్‌పై ఎమ్‌కే తరుణ్‌ విక్రమ్‌లు విజయం సాధించారు. 
బాలికల సింగిల్స్‌ విజేతలు
సునీతపై టీవీ దేవశ్రీ, వి.తేజస్విని రెడ్డిపై బి.కృషిరావ్‌, హర్షిణి విశ్వనా«థ్‌పై మానస చౌదరి, కే.అపరాజిత ఐక్యపై డి.సాత్విక గెలుపొందారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement