‘ఉక్కు’ వచ్చే వరకు పోరాటం | Sakshi
Sakshi News home page

‘ఉక్కు’ వచ్చే వరకు పోరాటం

Published Sat, Aug 20 2016 1:55 AM

' Steel ' to the fight

ప్రొద్దుటూరు:    జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మించే వరకు తమ పోరాటం ఆగదని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు పేర్కొన్నారు. సీపీఎం ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక విజయ్‌కుమార్‌ థియేటర్‌ నుంచి పుట్టపర్తి సర్కిల్‌ వరకు పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పుట్టపర్తి సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా ఇంత వరకు ఉక్కు కర్మాగారం ఊసే లేదన్నారు. తమకు ఓట్లు వేయలేదని జిల్లాపై వివక్షత చూపుతున్న టీడీపీ, బీజేపీలకు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. అలాగే ఎంపీలు కూడా ఈ సమస్యపై పార్లమెంటులో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా తెలిపారు. పార్టీ పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ విభజన చట్టంలో రూపొందించిన ప్రకారం ఉక్కు కర్మాగారాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందనన్నారు.
 

Advertisement
Advertisement