అనంతపురం అర్బన్ : బతుకుదెరువు కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన జిల్లా రైతులు అక్కడ అడుక్కుతింటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అఖిలపక్ష నాయకులు ధ్వజమెత్తారు. ఇలాంటి ప్రభుత్వంపై ఐక్య ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. జిల్లా రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఈ నెల 24న అసెంబ్లీ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, ఇందులో ప్రతిపక్షం, వామపక్షాలు పాల్గొనాలని కోరారు. శుక్రవారం స్థానిక సిద్ధార్థ పంక్షన్ హాల్లో తరిమెల నాగిరెడ్డి శతజయంతి కమిటీ ఆధ్వర్యంలో సమాలోచన సభ నిర్వహించారు. కమిటీ కన్వీనర్ డి.గోవిందరాజులు అధ్యక్షత వహించారు.
ఉరవకొండ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ప్రజల జీవనం దయనీయంగా మారినా, ప్రభుత్వం పట్టించుకోకుండా పెద్ద ఎత్తున అభివృద్ధి సాధించామంటూ గొప్పలు చెప్పుకుంటూ ప్రచార ఆర్భాటంతో కాలం గడుపుతోందని విమర్శించారు. అధిక ఆదాయం కోసమే ప్రజలు వలస పోతున్నారని అధికార పార్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు వాదనకు దిగడాన్ని ఆయన తప్పుబట్టారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కరువును పారదోలామని ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు.
సీపీఐ జిల్లా కార్యదర్శి డి.జగదీశ్ మాట్లాడుతూ జిల్లాలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొని రైతులు, కూలీలు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నా పట్టించుకోని ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్షం, వామపక్షాలు ఐక్య ఉద్యమం చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. ఆ దిశగా త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. జిల్లాలో తీవ్ర కరువు నెలకొంటే అధికార యంత్రాంగం వాస్తవాలను కప్పిపుచ్చి తప్పుడు సమాచారాన్ని ప్రభుత్వానికి అందిస్తోందన్నారు. ఫారం పాండ్ల తవ్వకంతో జిల్లాలో భూగర్భ జలమట్టం పెరిగిందని కలెక్టర్ విశాఖపట్టణంలో ప్రజెంటేషన్ ఇవ్వడం సరికాదన్నారు.
సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ మాట్లాడుతూ కరువు పరిస్థితులు ఇలాగే కొనసాగితే జిల్లా మొత్తం ఖాళీ అవుతుందన్నారు. గత ఏడాది చేపట్టిన ఉపాధి హామీ పనులకు సంబంధించి రూ.5.27 కోట్లు బిల్లులు పెండింగ్లో ఉన్నాయన్నారు. తాగునీటి పథకాల నిర్వహణకు ప్రభుత్వం అరకొరగా నిధులు సమకూర్చిందని మండిపడ్డారు.
నీటి పారుదల రంగం నిపుణుడు పాణ్యం సుబ్రమణ్యం మాట్లాడుతూ జిల్లాలో కరువు పరిస్థితులను అధిగమించేందుకు కనీసం 10 లక్షల ఎకరాలకు సాగునీటి వసతి కల్పించాలన్నారు. జిల్లాకు వంద టీఎంసీల నీరు కేటాయించాలన్నారు. సమావేశంలో తరిమెల నాగిరెడ్డి శత జయంతి కమిటీ సభ్యులు తరిమెల శరత్ చంద్రారెడ్డి, కదలిక ఎడిటర్ ఇమాం, నాయకులు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు కేవీ రమణ, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జాఫర్, సలీమ్ మాలిక్, రైతు సంఘం నాయకులు మల్లికార్జున, కాటమయ్య, వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు బి.కేశవరెడ్డి, టి.నారాయణస్వామి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
24న అసెంబ్లీ ఎదుట ధర్నా
Published Fri, Mar 10 2017 10:55 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీ20 వరల్డ్కప్కు ఐర్లాండ్ జట్టు ప్రకటన.. కెప్టెన్ ఎవరంటే?
మరో కుటుంబాన్ని ఆదుకున్న స్టార్ హీరో.. వీడియో వైరల్!
ఢిల్లీ బ్యాటర్లు ఊచ కోత.. రాజస్తాన్ ముందు భారీ టార్గెట్
రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నాము: కాంగ్రెస్ నేత పవన్ ఖేరా
బాహుబలి కేవలం 10 కోట్ల మంది మాత్రమే: రాజమౌళి కామెంట్స్
బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
తెలంగాణను అసమర్థులు ఏలుతున్నారు: కేసీఆర్
క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
నెల ముందే ప్రమోషన్.. ఇప్పుడు జాబ్ పోయింది: అగ్రరాజ్యంలో టెకీ ఆవేదన
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement