♦ గిరిజన కార్పొరేషన్ విభజనకు ఏపీ మెలిక
♦ షీలాభిడే కమిటీ నిర్దేశించినా పట్టించుకోని వైనం
♦ ఉమ్మడి ఆస్తుల పంపకానికి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట
♦ కొత్త పీఆర్సీ అమలుకాక నిరాశలో రాష్ట్ర ఉద్యోగులు
సాక్షి, హైదరాబాద్: గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ)ను విభజించకుండా ఏపీ ప్రభుత్వం మోకాలడ్డుతోంది. రాష్ర్ట విభజన జరిగి 17 నెలలు గడిచినా, జీసీసీ విభజనను ఎప్పటికప్పుడు వాయిదావేస్తోంది. విభజనను పూర్తిచేసి తెలంగాణకు చెందాల్సిన దానిని అప్పగించాలని షీలాభిడే కమిటీ ఏపీకి స్పష్టమైన ఆదేశాలిచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు. ఈ విభజన జరిగితే వెంటనే తెలంగాణకు రూ.33 కోట్లు ఏపీ చెల్లించాల్సి ఉండటంతో, ఏవో సాకులతో విభజనను ఏపీ వాయిదా వేస్తోంది. దీంతో తెలంగాణ జీసీసీ ఉద్యోగులకు సవరించిన పీఆర్సీ అమలుకాలేదు.
జీసీసీకి సంబంధించిన ఆస్తులు, అప్పులు, సిబ్బంది తదితర పది అంశాలు రెండు రాష్ట్రాల మధ్య చర్చనీయాంశమయ్యాయి. అయితే మూడు అంశాలు ప్రధానమైనవిగా పేర్కొంటూ తెలంగాణ జీసీసీ షీలాభిడే కమిటీ దృష్టికి తెచ్చింది. అందులో ఒకటి 2014,జూన్ 2 నాటికి రిటైరైన ఉద్యోగుల పదవీవిరమణ ప్రయోజనాలను అవశేష ఏపీ ప్రభుత్వమే చెల్లించాలి. రెండోది.. ఉమ్మడి జీసీసీలో తెలంగాణ నుంచి కొనుగోలు చేసిన రూ.3 కోట్ల విలువైన గమ్కరయ (తప్సిజిగురు)ను విక్రయించనందున ఆ మొత్తాన్ని 58:42 నిష్పత్తిలో తెలంగాణకు చెల్లించాలి. ఇక మూడోది, ఉమ్మడి జీసీసీ ప్రధాన కార్యాలయం విశాఖలోనే ఉన్నందున గతంలో విశాఖలో కొనుగోలు చేసిన వెయ్యి గజాల ఖాళీ స్థలాన్ని 58:42 నిష్పత్తిలో పంపిణీ చేయాలని పేర్కొన్నారు.
ఈ మూడు అంశాలపై ఎలాంటి వివాదం లేదని షీలాభిడే ఎక్స్పర్ట్ కమిటీ నిర్ధారించి విభజన పూర్తిచేయాలని గత ఆగస్టు 31న ఆదేశించింది. అయితే ఆ తర్వాత విభజనకు సంబంధించిన సమావేశాలకు ఏపీ ప్రతినిధులు హాజరుకాకుండా వాయిదాలు వేస్తున్నారు. కాగా, పదవీ విరమణ పొందిన జీసీసీ ఉద్యోగులు పెన్షన్, ఇతర ప్రయోజనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. కిందిస్థాయిలో పనిచేసిన ఉద్యోగులు తమ ఇళ్లలోని వస్తువులను అమ్ముకుని జీవనాన్ని గడపాల్సిన దుస్థితిలో ఉన్నారు. పింఛన్ కోసం హైదరాబాద్లోని జీసీసీ కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్నారు.
విభజనపై వాయిదా పద్ధతే!
Published Mon, Nov 9 2015 12:22 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- షర్మిల.. ఎందుకిలా..!
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అక్రమాలు కో‘కొల్లు’లు
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement