విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి | Sakshi
Sakshi News home page

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి

Published Mon, Oct 3 2016 10:27 PM

విద్యుదాఘాతంతో విద్యార్థి మృతి - Sakshi

నంద్యాల: దసరా సెలవుల్లో సరదాగా స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుకుంటూ ఓ విద్యార్థి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన గోస్పాడు మండలం దీబగుంట్లలో చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీలైన పుల్లమ్మ, బాలచంద్రుడు దంపతుల మూడో సంతానం తిరుపాలయ్య(15) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. దసరా సెలవులు రావడంతో సోమవారం స్నేహితులతో దాగుడు మూతల ఆట ఆడుతున్నాడు. దాక్కోవడానికి ఇంటిపైకప్పు వెళ్లాడు. కిందకు వేలాడుతున్న కరెంట్‌ తీగను ప్రమాదవశాత్తు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన విద్యార్థి అక్కడికక్కడే మృతి చెందాడు. గోస్పాడు పోలీసులు కేసు నమోదు చేశారు.       
 

Advertisement
Advertisement