రొళ్ల: చెరువులోకి జారిపడి శివన్న (13) అనే విద్యార్థి మృతి చెందిన ఘటన రొళ్ల మండలంలో చోటు చేసుకుంది. వివరాల్లోకెళితే.. గురువారం సాయంత్రం ఎంఆర్ గొల్లహట్టిలోని బడిగి క్రిష్టప్ప, గిరిజమ్మ దంపతుల రెండో సంతానమైన శివన్న ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. సాయంత్రం 4.30 గంటల సమయంలో పాఠశాల ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. అనంతరం తోటి విద్యార్థులతో కలిసి చెరువు కట్టపైకి వెళ్లాడు. అయితే చెరువు గుంతలోకి ప్రమాదశాత్తు జారిపడటంతో శివన్నకు ఈతరాని కారణంగా నీటిలో మునిగిపోయాడు.
తోటి విద్యార్థులు భయంతో ఇంటికి పరుగులు తీసి సమాచారం ఇచ్చారు. కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు సంఘటనా స్థలానికి చేరుకుని చూసేసరికి శివన్న విగతజీవిగా మారిపోయాడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో తల్లిదండ్రులు, బంధుమిత్రలు కన్నీరుమున్నీరుగా విలపించారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ లక్ష్మీనాయక్, జమేదార్బషీర్ అక్కడికి చేరుకుని ఘటనపై ఆరాతీశారు. వీఆర్ఓ శేఖర్కుమార్ ఎదుట పంచనామ నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెరువులోకి పడి విద్యార్థి మృతి
Published Thu, Sep 14 2017 10:42 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement