ఖానాపూర్ : మండలంలోని పెంబి గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులు మంగళవారం అస్వస్థతకు గురయ్యారు. 40 మందికిపైగా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. సాయంత్రం భోజనం వికటించడమే అందుకు కారణమై ఉంటుందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు. మంగళవారం అర్ధరాత్రి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి వార్డెన్ మోతిలాల్ విద్యార్థులను 108, ఆటోల్లో తరలించారు. మరో ఉపాధ్యాయుడికీ వాంతులు, విరేచనాలు అయ్యాయి. సాయంత్రం 5.30 గంటల నుంచే విద్యార్థులకు వాంతులు, విరేచనాలు ప్రారంభమయ్యాయి. ఆస్పత్రిలోని పడకలు నిండిపోయాయి.