బీసీహాస్టల్ మూసివేత: విద్యార్థుల రాస్తారోకో | Sakshi
Sakshi News home page

బీసీహాస్టల్ మూసివేత: విద్యార్థుల రాస్తారోకో

Published Fri, Jun 17 2016 1:16 PM

students rastaroko in ananthpur district

యాడికి: అనంతపురం జిల్లా యాడికిలో బీసీ హాస్టల్ మూసివేతను నిరసిస్తూ సీపీఐ, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు రాస్తారోకోకు దిగారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల 100లోపు విద్యార్థులున్న బీసీ హాస్టళ్లను మూసివేయాలని జారీ చేసింది. యాడికి బీసీ హాస్టల్లో 71 మంది మాత్రమే ఉండటంతో అధికారులు మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీనికి నిరసనగా విద్యార్థులు రాస్తారోకోకు దిగడంతో కాసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది.

Advertisement
Advertisement