అనంతపురానికి డెప్యుటేషన్‌పై సబ్‌ కలెక్టర్లు | Sakshi
Sakshi News home page

అనంతపురానికి డెప్యుటేషన్‌పై సబ్‌ కలెక్టర్లు

Published Tue, Aug 30 2016 4:22 PM

sub-collectors go to anatapuram  by deputation

సాక్షి ప్రతినిధి, ఏలూరు : అనంతపురంలో కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు ఐఏఎస్‌ అధికారులను ప్రభుత్వం డెప్యుటేషన్‌పై పంపింది. జిల్లా నుంచి ఇద్దరు సబ్‌ కలెక్టర్లను డెప్యుటేషన్‌పై పంపుతూ ఆదేశాలు జారీ చేసింది. నరసాపురం సబ్‌కలెక్టర్‌ దినేష్‌కుమార్, కుక్కునూరు సబ్‌కలెక్టర్, ఐటీడీఏ పీవో షాన్‌మోహన్‌ను డెప్యుటేషన్‌పై పంపింది. ఇటీవల వరకూ కృష్ణా పుష్కరాలకు కూడా ఈ ఇద్దరిని ప్రత్యేక అధికారులుగా పంపిన సంగతి తెలిసిందే. కృష్ణా పుష్కరాల నుంచి రాగానే మళ్లీ అనంతపురం డెప్యుటేషన్‌ వేయడంతో పోలవరం భూసేకరణ పనులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడినటై్టంది. 

 

 

Advertisement

తప్పక చదవండి

Advertisement