– గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి కార్యాధ్యక్షులు కపిలేశ్వరయ్య
కర్నూలు(టౌన్): గణేశ్ ఉత్సవాలను విజయవంతంగా నిర్వహిద్దామని గణేశ్ మహోత్సవ కే ంద్ర సమితి కార్యదక్షులు కపిలేశ్వరయ్య పిలుపు నిచ్చారు. బుధవారం స్థానిక వినాయక మందిరంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని కర్నూలు, ఆదోని, నంద్యాల ప్రాంతాల్లో వినాయక ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు హిందు, ముస్లిం ఐక్యతతో నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని మండల కేంద్రాల్లో నిమజ్జనం పూర్తయిందన్నారు. కేంద్ర సమితి సూచనలు పాటిస్తు ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలన్నారు. ఈ ఏడాది ఉత్సవాలను రామానుజాచార్యులకు అంకితం చేస్తున్నట్లు చెప్పారు. గణేశ్ మహోత్సవ కేంద్ర సమితి నగర కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శి కిష్టన్న, బాలసుబ్రమాణ్యంలు మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ సారి విగ్రహాల సంఖ్య పెరిగిందన్నారు. ఉత్సవాల విజయవంతానికి జిల్లా అధికారులు, పోలీసు అధికారులు సహకరించాలన్నారు. బక్రీద్ పండుగ జరుపుకుంటున్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర సమితి కోశాధికారి సందడి సుధాకర్, నగర ప్రధాన కార్యదర్శి రంగస్వామి, నగర ఉపాధ్యక్షులు ప్రాణేష్, నగర కార్యదర్శి హరీష్బాబు, కాళింగి నరసింహవర్మ పాల్గొన్నారు.