‘జనసేన సభను జయప్రదం చేయండి’ | Sakshi
Sakshi News home page

‘జనసేన సభను జయప్రదం చేయండి’

Published Thu, Nov 3 2016 12:01 AM

success to janasena meet

అనంతపురం రూరల్‌ : ప్రత్యేక హోదా డిమాండ్‌తో ఈనెల 10న జనసేన పార్టీ అధినేత పవ¯ŒSకళ్యాణ్‌ తలపెట్టిన బహిరంగ సభను జయప్రదం చేయాలని పవ¯ŒSకళ్యాణ్‌ అభిమాన సంఘం నాయకులు భవాని రవికుమార్, టీసీ వరణ్, డిస్కోబాబు పిలుపునిచ్చారు. బుధవారం బాలాజీ రెసిడెన్సీలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ జనసేన పార్టీ కోశాధికారి రాఘవయ్య అనంతపురంలోని బహిరంగ సభా వేదిక స్థలాన్ని పరిశీలించిన అనంతరం షెడ్యూల్‌ విడుదల చేస్తారన్నారు. 10వ తేదీ సాయంత్రం 4 గంటలకు అనంతపురం కొత్తూరు జూనియర్‌ కళాశాలలో బహిరంగ సభ ఉంటుందన్నారు. ఇదే వేదిక నుంచి అనంత కరువు పరిస్థితులపై పవ¯ŒS కళ్యాణ్‌ మాట్లాడుతారన్నారు. జిల్లా నలుమూల నుంచి అభిమానులు పెద్ద ఎత్తున పార్టీలకతీతంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పవ¯ŒS అభిమాన సంఘం నాయకులు గల్లా హర్ష, నాగేంద్ర ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement