విద్యారణ్యపురి : జిల్లాలోని వెంకటాపూర్ మండలం సుద్దక్కపెల్లిలోని ప్రాథమిక పాఠశాలలోని ఎస్జీటీ ఎన్.రమేష్ను సస్పెన్షన్ చేస్తూ గురువారం సాయంత్రం డీఈవో రాజీవ్ ఉత్తర్వులు జారీచేశారు. రమేష్ ఈఏడాది జూలై 6వతేదీ నుంచి విధులకు రావడంలేదు. లీవ్లెటర్ లేకుండా గైర్హాజరవుతున్నట్లు ఎంఈఓ ఆ పాఠశాలను సందర్శించిన సమయంలో అటెండెన్స్ రిజిస్టర్లో ఆబ్సెంట్ వేశారు.
కానీ దాన్ని రమేష్ చెరిపేసి ఓడీగా రాసుకున్నట్లు ములుగు డివిజన్ డిప్యూటీ ఈవో సారంగపాణి అయ్యాంగార్ విచారణలో వెల్లడైంది. నివేదిక మేరకు ఉపాధ్యాయుడు రమేష్ను సస్పెన్షన్ చేసినట్లు రాజీవ్ వివరించారు.