సుద్దక్కపల్లి పీఎస్‌ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌ | Sakshi
Sakshi News home page

సుద్దక్కపల్లి పీఎస్‌ ఉపాధ్యాయుడు సస్పెన్షన్‌

Published Fri, Aug 12 2016 12:19 AM

suddakkapalli teacher suspension

విద్యారణ్యపురి : జిల్లాలోని వెంకటాపూర్‌ మండలం సుద్దక్కపెల్లిలోని ప్రాథమిక పాఠశాలలోని ఎస్‌జీటీ ఎన్‌.రమేష్‌ను సస్పెన్షన్‌ చేస్తూ గురువారం సాయంత్రం డీఈవో రాజీవ్‌ ఉత్తర్వులు జారీచేశారు. రమేష్‌ ఈఏడాది జూలై 6వతేదీ నుంచి విధులకు రావడంలేదు. లీవ్‌లెటర్‌ లేకుండా గైర్హాజరవుతున్నట్లు ఎంఈఓ ఆ పాఠశాలను సందర్శించిన సమయంలో అటెండెన్స్‌ రిజిస్టర్‌లో ఆబ్సెంట్‌ వేశారు.
 
కానీ దాన్ని రమేష్‌ చెరిపేసి ఓడీగా రాసుకున్నట్లు ములుగు డివిజన్‌ డిప్యూటీ ఈవో సారంగపాణి అయ్యాంగార్‌ విచారణలో వెల్లడైంది. నివేదిక మేరకు ఉపాధ్యాయుడు రమేష్‌ను సస్పెన్షన్‌ చేసినట్లు రాజీవ్‌ వివరించారు. 

Advertisement
Advertisement