లక్ష్మీపురం కేసీపీలో చెరకు క్రషింగ్‌ ప్రారంభం | Sakshi
Sakshi News home page

లక్ష్మీపురం కేసీపీలో చెరకు క్రషింగ్‌ ప్రారంభం

Published Fri, Dec 16 2016 6:44 PM

లక్ష్మీపురం కేసీపీలో చెరకు క్రషింగ్‌ ప్రారంభం

చల్లపల్లి : లక్ష్మీపురంలోని కేసీపీ చక్కెర కర్మాగారంలో 2016–17 సీజన్‌ క్రషింగ్‌ శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైంది. కేసీపీ షుగర్స్‌ చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ జి.వెంకటేశ్వరరావు తెల్లవారుజామున 3.51 గంటలకు ప్రత్యేక పూజలు చేయించి క్రషింగ్‌ ప్రారంభించారు. ఈ ఏడాది అత్యధిక చక్కెర రికవరీ సాధించి కర్మాగారం లాభాల్లో పయనించేలా ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని కోరారు. తద్వారా రైతులు, కార్మికుల సంక్షేమానికి యాజమాన్యం మరింత ఉత్సాహంగా ముందుకొచ్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రైతు ప్రముఖులు గుత్తికొండ కోటేశ్వరరావు, వేమూరి రత్నగిరిరావు, కేసీపీ డీజీఎం మండవ రామ్మోహనరావు, వైవీ రత్నప్రసాద్, ఇతర అధికారులు, కార్మికులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement