భార్య శవాన్ని వదిలేసి స్వదేశంకు భర్త | Sakshi
Sakshi News home page

భార్య శవాన్ని వదిలేసి స్వదేశంకు భర్త

Published Thu, Jul 21 2016 11:37 PM

కొడుకుతో సుప్రజ ఫైల్ ఫొటో - Sakshi

చందానగర్‌: ‘‘మేమందరం ఉండగానే నా కూతురి మృతదేహం అనాథగా మిగిలింది.  నా ఆరోగ్యం సహకరించడం లేదు. నా కూతురి మృతదేహాన్ని ఇక్కడికి తీసుకువస్తే చాలు’’.. అని ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సుప్రజ తండ్రి శంకరయ్య విలపిస్తూ అన్నాడు. ఈనెల 14న ఆస్ట్రేలియాలో శంకరయ్య కూతురు సుప్రజ, మనవడు శ్రీహన్‌ (నాలుగు నెలలు) వారుండే అపార్ట్‌మెంట్‌పై నుంచి పడి మృతి చెందారు. 15న మృతురాలి మామ గంగాధర్‌ ఆస్ట్రేలియా వెళ్లి సుప్రజ, చిన్నారి మృతదేహాలను తీసుకొస్తాడని శంకరయ్య కుటుంబీకులు అనుకున్నారు. కానీ అక్కడికి వెళ్లిన గంగాధర్‌ నుంచి వీరికి ఎలాంటి సమాచారం రాలేదు.  కూతురి మృతదేహం కోసం వారం రోజులుగా ఎదురుచూసిన శంకరయ్య కుటుంబసభ్యులు.. మృతదేహం రాకపోవడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

భర్త రావడంతో అన్నీ అనుమానాలే...?
కాగా, మృతురాలు సుప్రజ భర్త శ్రీనివాస్, అతడి తండ్రి గంగాధర్, కూతురు సహస్ర బుధవారం హైదరాబాద్‌కు చేరుకొని, నేరుగా నిజామాబాద్‌ జిల్లాలోని తమ స్వగ్రామం ఆర్మూర్‌ వెళ్లిపోయారని శంకరయ్య తెలిపారు. సుప్రజ ఎలా చనిపోయిందో తెలుసుకొని ఆస్ట్రేలియా నుంచి సమాచారం ఇస్తానని తనతో చెప్పి వియ్యంకుడు గంగాధర్‌ ఎటువంటి సమాచారం ఇవ్వలేదని, మృతదేహాన్ని తీసుకురాకపోగా.. నేరుగా ఆర్మూర్‌ వెళ్లిపోవడం కుమార్తె మృతిపై తమకున్న అనుమానాలు బలపడుతున్నాయని ఆయన అన్నారు. 

Advertisement
Advertisement