సింహవాహనంపై శ్రీవారు | Sakshi
Sakshi News home page

సింహవాహనంపై శ్రీవారు

Published Tue, May 9 2017 11:04 PM

సింహవాహనంపై శ్రీవారు

ఉరవకొండ రూరల్‌ : పెన్నహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో మూడో రోజు మంగళవారం శ్రీవారు సింహవాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారికి అభిషేకం, మహామంగళ హారతి, కుంకుమార్చన కార్యక్రమాలు జరిగాయి. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీలక్ష్మీనారసింహుడు సింహ వాహనంపై కొలువుదీర్చారు. విశేష పుష్పాలతో అలంకరించిన ప్రత్యేక పల్లకీలో స్వామి వారిని ఊరేగించారు. అలాగే నృసింహ జయంతి సందర్భంగా స్వామివారి మూల విరాట్‌కు విశేష పుష్పాలతో అలంకరించారు. ప్రధాన అర్చకులు ద్వారకనాథాచార్యులు, ఈఓ రమేష్‌బాబు అధ్వర్యంలో స్వామి వారికి పూజలు నిర్వహించారు.

Advertisement
Advertisement