Sakshi News home page

నా పిల్లలను బాగా చూసుకోండి

Published Fri, May 12 2017 10:08 PM

నా పిల్లలను బాగా చూసుకోండి - Sakshi

– సూసైట్‌నోట్‌ రాసి యువకుడు ఆత్మహత్య
 
 మహానంది: ‘నా చావుకు ఎవరూ కారణం కాదు. కడుపునొప్పితో చనిపోతున్నాను. నా బిడ్డ, కొడుకు అంటే నా ప్రాణం. నా పిల్లలను బాగా చూసుకోండి’ అంటూ బుక్కాపురానికి చెందిన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శిరివెళ్ల మండలం కోటకొండకు చెందిన షహీన్‌షావలి(26)కి నంద్యాలకు చెందిన రేష్మతో వివాహంమైంది. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్నేళ్లు కోటకొండలో ఉన్న వీరు ఇటీవల బుక్కాపురం గ్రామంలో ఉన్న వారి బంధువుల సహాయంతో గ్రామానికి చేరుకుని ఓ ఇంటిని అద్దెకు తీసుకుని కూలీపనులు చే సుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి కుమారుడు అస్లాం, కుమార్తె కరిమూన్‌లు ఉన్నారు. అప్పు చేసి ఆటో కొనుగోలు చేసుకున్న షహీన్‌షావలి కొద్దిరోజుల పాటు ఆటో నడుపుకుంటూ ఉండేవాడు. అది  గిట్టుబాటు కాకపోవడంతో కూలీ పనులకు వెళ్తున్నాడు. శుక్రవారం ఉదయం షహీన్‌షావలి లుంగీతో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆత్మహత్యకు ముందు సూసైడ్‌ నోట్‌ రాశాడు. ‘నాకు కోటకొండ అంటే ప్రాణమని, నన్ను అక్కడే పూడ్చండి.  షేక్షావలి మామానువ్వు మందు మానుకో.. రేష్మా నన్ను క్షమించు’ అంటూ అంటూ వచ్చి రాని చదువుతో రాసిన అక్షరాలు స్థానికులను కలిచివేశాయి.  భర్త మృతితో భార్య రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టించాయి. సుమారు రూ. 50వేల అప్పు ఉందని భార్య తెలిపింది. విషయం తెలుసుకున్న మహానంది ఎస్‌ఐ పెద్దయ్యనాయుడు గ్రామానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం నంద్యాలకు తరలించారు.   
 

Advertisement

తప్పక చదవండి

Advertisement