తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు | Sakshi
Sakshi News home page

తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు

Published Wed, Jul 27 2016 12:09 AM

తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీరు

చేర్యాల : తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి గోదావరి నీళ్ల పంపింగ్‌ను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా తపాస్‌పల్లి రిజర్వాయర్‌ అధికారులు మాట్లాడుతూ తపాస్‌పల్లి రిజర్వాయర్‌ 0.3 టీఎంసీ  (300 ఎంసీఎస్‌టీ ) నీటి సామర్థ్యం ఉందని తెలిపారు.
గోదావరి నీటిని ధర్మసాగర్‌ నుంచి గండిరామారం మీదుగా బొమ్మకూర్‌కు, అక్కడి నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌లోకి  నీటిని పంపింగ్‌ చేస్తున్నట్లు చెప్పారు. తపాస్‌పల్లిలో ప్రస్తుతం నీళ్లు తక్కువగా ఉన్నందున గోదావరి నీళ్లతో పంపింగ్‌ చేస్తున్నామని పేర్కొన్నారు. 

Advertisement
Advertisement